షీషెల్స్ నేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక కానుకలు

by Muthe.Rajitha |

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల సీషెల్స్‌ పర్యటనలో భాగంగా అక్కడి అగ్రనేతలకు అద్భుతమైన బహుమతులను కానుకగా ఇచ్చారు.

షీషెల్స్ నేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక కానుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల సీషెల్స్‌ పర్యటనలో భాగంగా అక్కడి అగ్రనేతలకు భారతీయ సంస్కృతి, విశిష్టమైన హస్తకళలను ప్రతిబింబించే అద్భుతమైన బహుమతులను కానుకగా ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా సీషెల్స్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఒక అందమైన ఇత్తడి తాబేలును బహుమతిగా ఇచ్చారు. భారతీయ సంస్కృతిలో తాబేలును సుస్థిరతకు, సుదీర్ఘ ఆయురారోగ్యాలకు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. భారతదేశంలోని నిపుణులైన కళాకారులు ఇత్తడితో ఎంతో నైపుణ్యంతో చెక్కిన ఈ కానుక అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా, సీషెల్స్ ఉపాధ్యక్షుడి సతీమణికి ప్రధాని మోడీ భారతదేశానికి చెందిన అత్యంత ప్రసిద్ధమైన కాంజీవరం స్కార్ఫ్‌ను (Kanjeevaram Scarf) బహుమతిగా అందజేశారు. తమిళనాడులోని కాంచీపురం చేనేత కళాకారుల ప్రత్యేకత అయిన కాంజీవరం పట్టు, దాని నాణ్యతకు, అద్భుతమైన జరీ డిజైన్లకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ కానుకల ద్వారా భారతీయ హస్తకళల వైభవాన్ని చాటడమే కాకుండా, ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ప్రధాని ఈ ముద్ర వేశారు.

Next Story