రేపు పూణే మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని

by Disha Web |
రేపు పూణే మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రతిష్టాత్మక పూణే మెట్రోను ప్రారంభించనున్నారు. రూ.11,400 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన కూడా ప్రధాని చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం 11.30 గంటలకు పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు.

ఈ ప్రాజెక్ట్ పూణేలో అర్బన్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించే ప్రయత్నం' అని పేర్కొంది. మొత్తం 32.2 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గంలో ముందుగా 12 కిలోమీటర్లను ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభం కూడా చేయనున్నారు. వీటిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ, మూల-ముఠా నది ప్రాజెక్టులు పునరుజ్జీవనానికి శంకుస్థాపనతో పాటు 100 ఎలక్ట్రానిక్ బస్సుల ప్రారంభోత్సవం ఉన్నాయి.


Next Story

Most Viewed