- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాల్పుల కేసు.. 'ఖాన్ సార్'కు పాట్నా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు!
పాట్నా కోచింగ్ సెంటర్ కాల్పుల కేసులో ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త 'ఖాన్ సార్'కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

దిశ, వెబ్ డెస్క్: బిహార్లో ప్రముఖ విద్యావేత్తగా ప్రసిద్ధి చెందిన 'ఖాన్ సార్' కు పాట్నా కోర్టు సోమవారం (జూలై 13, 2026) పెద్ద ఉపశమనం కలిగించింది. గత నెలలో ఆయనకు చెందిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద జరిగిన కాల్పులు, హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో ఖాన్ సార్కు న్యాయస్థానం ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేసింది. ఆయనతో పాటు సదరు కోచింగ్ సెంటర్కు చెందిన మరో ముగ్గురు సిబ్బందికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినట్లు ఖాన్ సార్ తరఫు న్యాయవాది ధృవీకరించారు.
జూన్ ప్రారంభంలో దాడి
ఈ కేసు వివరాల ప్రకారం.. జూన్ 2వ తేదీ రాత్రి పాట్నాలోని 'ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్' పై 15 నుండి 20 మంది గుర్తు తెలియని వ్యక్తుల బృందం ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేయడంతో పాటు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. ఈ గొడవ కాస్తా ఆ తర్వాత అక్కడ కాల్పుల ఘటనకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఖాన్ సార్, ఆయన సిబ్బంది ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.






