షాకింగ్ న్యూస్.. భారత జెండాను' ఉపయోగిస్తున్న పాకిస్తాన్ విద్యార్థులు

by Web Desk |
షాకింగ్ న్యూస్.. భారత జెండాను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా అక్కడ చదువుకుంటున్న అనేక దేశాల విద్యార్థులు తమ దేశాలకు వెళ్లడానికి నానా తిప్పలు పడుతున్నారు. భరత్ మాత్రం తన కున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోని విద్యార్థులను తిరిగి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులను ఉక్రెయిన్ బోర్డర్ దేశాల వద్దకు తీసుకోచ్చి అక్కడి నుంచి అందుబాటులో ఉన్న విమానాశ్రయాల నుంచి నేరుగా ఇండియా తీసుకొస్తుంది.

ఈ నేపద్యంలో ఉక్రెయిన్ నుంచి రొమేనియా చేరుకున్న భారతీయ విద్యార్థులు మాట్లాడుతూ.. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్, టర్కీ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారని చెప్పారు. భారత్ జెండా, భారతీయులు పాకిస్తాన్, టర్కీ విద్యార్థులకు గొప్ప సహాయం చేశాయి అని ఇండియా విద్యార్థులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున దాదాపు 220 మంది భారతీయ విద్యార్థులు ఇస్తాంబుల్ మీదుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.



Next Story

Most Viewed