బాలీవుడ్ నటికి షాక్ ఇచ్చిన కోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

by Disha Web |
బాలీవుడ్ నటికి షాక్ ఇచ్చిన కోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హాపై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటిని ఏప్రిల్ 25న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక విషయానికొస్తే.. మొరాదాబాద్‌లోని కట్ఘర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రమోద్ శర్మ అనే ఈవెంట్ ఆర్గనైజర్ ఢిల్లీలో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేశాడు.

దానికి నటి సోనాక్షి సిన్హాని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఆయన.. అడ్వాన్స్‌గా రూ. 28 లక్షలు కూడా చెల్లించాడు. కానీ, ఈ బ్యూటీ ఆ ఈవెంట్‌కి హాజరు కాలేదు. దీంతో తన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని, నటి మేనేజర్ ఇచ్చేందుకు నిరాకరించినట్లుగా చెబుతూ.. 2019లో సోనాక్షిపై చీటింగ్ కేసు వేశాడు ప్రమోద్ శర్మ. అయితే ఈ కేసు విషయంలో స్టేట్‌మేంట్ ఇచ్చేందుకు సోనాక్షి పలుమార్లు మొరాదాబాద్ వచ్చినా.. కోర్టు విచారణకి హాజరుకాకపోవడంతో ఏసీజేఎమ్ (అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Next Story