ఎస్‌యూవీ మోడల్ 'మాగ్నైట్' 50,000వ యూనిట్‌ను విడుదల చేసిన నిస్సాన్ ఇండియా!

by Disha Web Desk 12 |
ఎస్‌యూవీ మోడల్ మాగ్నైట్ 50,000వ యూనిట్‌ను విడుదల చేసిన నిస్సాన్ ఇండియా!
X

చెన్నై: ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ మాగ్నైట్ 50,000వ యూనిట్‌ను చెన్నై ప్లాంట్ నుంచి మార్కెట్లోకి విడుదల చేసింది. రెనాల్ట్-నిస్సాన్ సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ కారు దేశీయ, ఎగుమతుల్లో ఇప్పటివరకు లక్షకు పైగా వినియోగదారుల నుంచి బుకింగ్‌లను సాధించిందని కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిస్సాన్ సంస్థ గ్లోబల్ మార్కెట్ వ్యూహంలో మాగ్నైట్ ప్రధాన మోడల్‌గా ఉంది. ఇది భారత్‌తో పాటు విదేశాల్లో కంపెనీ ఉనికిని బలోపేతం చేయడంలో, వినియోగదారులను చేరువ చేయడంలో కీలకంగా ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ సినన్ చెప్పారు.

ఈ మోడల్‌ను మొదటగా 2020, డిసెంబర్‌లో తీసుకొచ్చామని, కొవిడ్-19 మహమ్మారి తో పాటు సెమీకండక్టర్ల కొరత లాంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి 50,000వ యూనిట్ మాగ్నైట్ మోడల్‌ను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ వివరించింది. గతేడాది నిస్సాన్ ఈ మోడల్ వాహనాన్ని భారత్ నుంచి దక్షిణాఫ్రికా, ఇండోనేషియా లాంటి దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా నేపాల్, భూటాన్, శ్రీలంక, కెన్యా సహా అనేక దేశాల్లో అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed