మీరు పరీక్ష రాయండి.. మేం డిస్టర్బ్ చేస్తాం..!

by Muthe.Rajitha |   (  Updated:2026-06-19 23:33:40  IST  )

కర్ణాటకలోని గడగ్‌లో బి.ఎడ్ (B.Ed) విద్యార్థులకు నిర్వహించిన సైకాలజీ ప్రాక్టికల్ పరీక్ష విద్యా రంగంలో ఒక సరికొత్త ప్రయోగానికి వేదికగా నిలిచింది.

మీరు పరీక్ష రాయండి.. మేం డిస్టర్బ్ చేస్తాం..!
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని గడగ్‌లో బి.ఎడ్ (B.Ed) విద్యార్థులకు నిర్వహించిన సైకాలజీ ప్రాక్టికల్ పరీక్ష విద్యా రంగంలో ఒక సరికొత్త ప్రయోగానికి వేదికగా నిలిచింది. సాధారణంగా నిశ్శబ్ద వాతావరణంలో జరిగే పరీక్షలకు భిన్నంగా, ఇక్కడ విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగానే శబ్దాలు, అల్లరి, వివిధ రకాల డిస్ట్రాక్షన్స్ సృష్టించారు. ఇలాంటి పరిస్థితులలో కూడా విద్యార్థులు తమ దృష్టిని ఎలా కేంద్రీకరిస్తారు, వారి మానసిక నియంత్రణ మరియు ఏకాగ్రత స్థాయిలు ఏ మేరకు పనిచేస్తాయనే అంశాలను ప్రత్యక్షంగా పరీక్షించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో ఉపాధ్యాయులు కాబోయే అభ్యర్థులకు తరగతి గదుల్లో ఎదురయ్యే గందరగోళ పరిస్థితులను తట్టుకుని, స్థిరంగా పని చేయగలిగేలా ఈ పరీక్ష ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు. నిజ జీవితంలో ఎదురయ్యే మెంటల్ డిస్ట్రాక్షన్స్ ను తట్టుకునే లక్షణం కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్‌గా నిరూపించిన ఈ విధానం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని ఆకర్షించింది. విద్యా విధానంలో ఇలాంటి వినూత్న ప్రయోగాలు ప్రశంసనీయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీడియో

Next Story