తెలంగాణ ప్రభుత్వం నుంచి గౌరవం.. సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పిన నాగచైతన్య."

by Malleboina Mahesh |

గద్దర్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్-2025లో 'తండేల్' చిత్రానికి గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఈ గౌరవంపై చైతూ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి గౌరవం.. సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పిన నాగచైతన్య.
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య (Naga Chaitanya is the hero) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)కి థాంక్స్ చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 'గద్దర్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్-2025'ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరో నాగ చైతన్యకు అద్భుత గౌరవం దక్కింది. తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 'తండేల్' చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడు (Best Actor) అవార్డును అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ తొలి అవార్డుల ప్రదానోత్సవంలో చైతూ ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ అపురూప గౌరవం దక్కడంపై నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన తన ట్వీట్‌లో "ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే 'తండేల్' చిత్రం ఉత్తమ జాతీయ సమగ్రత (Best National Integration Film) కేటగిరీలో అవార్డు గెలవడం నాకు మరింత గర్వకారణం" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ లకు ధన్యవాదాలు తెలుపుతూ.. 'తండేల్' పాత్ర తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చైతూ చెప్పుకొచ్చారు. ఈ సక్సెస్‌లో భాగమైన సాయి పల్లవి, దేవి శ్రీ ప్రసాద్, చిత్ర యూనిట్ మొత్తానికి ఆయన తన విజయాన్ని అంకితం చేశారు.

Next Story