- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వారు దాడులు ఆపకుంటే.. తునికాకు నిలిపివేయండి'
దిశ, గుండాల : పార్లపల్లి మండలంలోని రాయపాడు ఇతర గ్రామాల్లో పోడు భూములు ఆక్రమణకు.. Latest Telugu News..

X
దిశ, గుండాల : పార్లపల్లి మండలంలోని రాయపాడు ఇతర గ్రామాల్లో పోడు భూములు ఆక్రమణకు అటవీశాఖ అధికారులు జేసీబీతో కందకాలు తవ్వడం నిలిపి వేయకపోతే.. రానున్న బీడీ ఆకు సీజన్లో ఎనిమిది గ్రామాల్లో తునికాకు సేకరణ నిలిపివేయాలని ఆళ్ల పల్లి ఎంపీపీ మంజుభార్గవి పోడు సాగుదారులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని రాయపాడు గ్రామంలో అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వడానికి ప్రయత్నించగా స్థానికులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుభార్గవి మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు అత్యుత్సాహంతో దాడులు చేస్తూ.. గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, తక్షణమే వారిపై దాడులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.
- Tags
- lands
Next Story






