- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మంత్రి కేటీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ
by Nagaya |

X
దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత, అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40 శాతం సబ్సిడీ 6 నెలలు దాటినా రాలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మంత్రి కేటీఆర్కు బహిరంగ లేఖ రాశారు. చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులు పట్టు, నూలు కొనుగోలు చేస్తారని, 2 నెలలకు ఒక్కసారి అందాల్సిన సబ్సిడీ 6 నెలలు అయినా అందటం లేదని లేఖలో తెలిపారు. పట్టు నూలు కిలో 6000 రూపాయలు పెరగడంతో మాస్టర్ కార్మికులకు పని కల్పించలేక మగ్గాలు బంద్ చేశారని తెలిపారు. పని లేక చేనేత కార్మికుల ఇల్లు గడవడం గగనం అయ్యిందన్నారు. చేనేత కార్మికులు సబ్సిడీ కూడా ప్రభుత్వం 4700 రూపాయలు మాత్రమే ఇస్తుందని గుర్తుచేశారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Next Story