13,500కు పైగా రష్యన్ సైనికుల మృతి: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడి

by Disha Web Desk 17 |
13,500కు పైగా రష్యన్ సైనికుల మృతి: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడి
X

కీవ్: తమ దేశం‌పై పోరులో ఇప్పటివరకు 13,500 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. తమ సైన్యం చేసిన ప్రతిదాడుల్లో 404 రష్యన్ యుద్ధట్యాంకర్లు ధ్వంసమైనట్లు తెలిపారు. కాగా ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో 1,279 సాయుధ వాహానాలు, 81 విమానాలు, 95 హెలికాప్టర్లు, 150 ఫిరంగులు, 64 ఎంఎల్ఆర్ లు నాశనం చేసినట్లు చెప్పారు. ఇంకా 60 నీటి ట్యాంకులు, 640 వాహానాలు, 3 వెసెల్స్, 9 యూఏవీలు, 36 రష్యన్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ లను కూడా ధ్వంసం చేశామన్నారు. కాగా గత నెల 24న ప్రారంభమైన యుద్దం మంగళవారంతో 20వ రోజుకు చేరుకుంది.

Next Story

Most Viewed