- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేబులో పేలిన ఫోన్.. తీవ్ర గాయాలు
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఒక వ్యక్తి జేబులో సెల్ఫోన్ పేలి తీవ్ర గాయాలైన ఘోర ఉదంతం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్లోని జోధ్పూర్లో ఒక వ్యక్తి జేబులో సెల్ఫోన్ పేలి తీవ్ర గాయాలైన ఘోర ఉదంతం చోటుచేసుకుంది. గోపాల్ సోని అనే చిరు వ్యాపారి తన ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడం గమనించి, కంగారుగా దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ మొబైల్ అతను బయటకు తీస్తుండగానే చేతిలోనే సడన్ గా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతని తొడకు, చేతికి తీవ్రమైన గాయాలు కావడంతో, గమనించిన స్థానికులు హుటాహుటిన అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సాధారణంగా ఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఈ కేసులో బాధితుడు చెప్పిన వివరాలు అందరినీ షాకింగ్ కు గురి చేస్తున్నాయి. తాను ఈ 'వివో' (Vivo) ఫోన్ను రెండు సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశానని, ప్రమాదం జరగడానికి ముందు ఫోన్ అస్సలు వేడిగా కూడా లేదని బాధితుడు తెలిపాడు. అంతేకాకుండా, పేలిపోయే సమయానికి మొబైల్లో 90 శాతం ఛార్జింగ్ ఉందని, ఎలాంటి హెచ్చరిక సంకేతాలు లేకుండానే ఈ బ్లాస్ట్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానిక మొబైల్ వినియోగదారుల్లో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించింది.






