సహస్ర చండీ మహాయాగానికి హాజరైన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి

by Disha Web |
సహస్ర చండీ మహాయాగానికి హాజరైన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి
X

దిశ, మెదక్: సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కూచన పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర చండీ మహాయాగం ఆధ్యాత్మిక కార్యక్రమమునకు శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలు హాజరయ్యారు. వేద పండితులు ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల మధ్య యాగ స్థలికి చేరుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు.. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. హవేలీ ఘన్పూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి మండల సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి ఘన సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేలకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాధవానంద స్వామి వారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

మహాయాగంలో హాజరైన ఎమ్మెల్యేలు..

ఎమ్మెల్యేలు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, దేవా గౌడ్, మైపాల్ రెడ్డి, యామి రెడ్డి, సాయా గౌడ్, శీను నాయక్ ఎంపీటీసీలు రాజిరెడ్డి యువ నాయకులు స్వామి నాయక్, ప్రశాంత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed