నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి

by Disha Web |
నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి
X

దిశ, నాచారం: ఉప్పల్ నియోజకవర్గం సమస్యలపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్‌కు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ గురుకుల పాఠశాలలకు రెండు ఎకరాల స్థలం, హబ్సిగూడ డివిజన్‌లోని ప్రభుత్వ స్థలంలో మల్టీపర్పస్ యూనిటీ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

అంతేకాకుండా మల్లాపూర్ నెహ్రూ నగర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో కూడా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, అదేవిధంగా చెర్లపల్లి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో శిథిలావస్థ స్థితిలో ఉన్న గృహాలకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు మైనింగ్ ఫండ్ విడుదల చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ని కోరారు. అందుకుగాను గారు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ పన్నాల దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, తండా వాసుదేవ్ గౌడ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed