సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే జీఎంఆర్

by Batti.Sumithra |

రామచంద్రాపురం డివిజన్‌లోని కాకతీయ నగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే జీఎంఆర్
X

దిశ, రామచంద్రాపురం : రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సత్సంబంధాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్, రాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story