ఆ వార్త నన్ను ఎంతగానో బాధించింది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

by Dishanational1 |
ఆ వార్త నన్ను ఎంతగానో బాధించింది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, తుంగతుర్తి: ప్రముఖ కవి,గేయరచయిత కందికొండ మరణం పట్ల తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలిపారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ యాదగిరి మృతి తనను ఎంతో బాధించిందని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన రాసిన పాటలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన వివరించారు.

Next Story

Most Viewed