ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్

by Dishafeatures2 |
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తోంది. తన సారథ్యంలో భారత జట్టు ఎన్నో విజయాలను అందుకుంది. అయితే తాజాగా మిథాలీ రాజ్ ఓ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని ఘనత సాధించింది. ఓ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మిథాలీ ఈ అరుదైన గైరవం అందుకుంది. ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఏకైక మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ అరుదైన ఘనత అందుకుంది. 2022 ప్రపంచ కప్‌లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ మిథాలీ సారథ్యం వహిస్తున్న 24వ మ్యాచ్ కావడం విశేషం. దీంతో మహిళా ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఘనతను మిథాలీ అందకుంది. అయితే ఇందులో ఆస్ట్రేలియా మహిళా టీం కెప్టెన్ బెలిండా క్లార్క్ 23 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది.


Next Story