బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయానికి కృష్ణాబోర్డుకు లేఖ రాస్తోందని ఎద్దేవా చేశారు. తాము సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామనేది అబద్ధమని స్పష్టం చేశారు. గ్రిడ్‌కు ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే ఐదు నిమిషాలు నిళ్లు వదులుతారని అన్నారు. తాగునీరు తమకూ ముఖ్యమే అని వ్యాఖ్యానించారు.


Next Story