కరోనా విజృంభణ.. ఒక్క రోజులో 6 లక్షల కేసులు.. భారత్‌కు ముప్పు తప్పదా

by Dishanational2 |
కరోనా విజృంభణ.. ఒక్క రోజులో 6 లక్షల కేసులు.. భారత్‌కు ముప్పు తప్పదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల్లో భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసుల పెరుగుదల మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్ పొరుగుదేశమైన చైనాలో భారీగా కేసులు నమోదవుతుండగా.. లాక్డౌన్ కూడా విధించాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా, దక్షిణ కొరియాలోనూ బుధవారం ఒక్క రోజులో 4 లక్షలు, గురువారం 6 లక్షల కేసులు నమోదవడంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి తగ్గిందని సంతోషించేలోపే పెరుగుతున్న కొత్త కేసులు ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. అయితే, ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాల్లోనూ భారత్‌లోనూ కరోనా ఫోర్త్ వేవ్ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.



Next Story