- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పట్టపగలే చుక్కలు చూపిన దొంగలు తాళం వేసిన ఇంట్లో చోరీ!
దిశ, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో బుధవారం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న కిషన్ చికెన్ వ్యాపారం చేస్తూ, జీవనం గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామంలో తన చెల్లెలు ఇంట్లో బుధవారం జరిగిన శుభ కార్యక్రమంలో పాల్గొని, రాత్రి 11 గంటలకు తన ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం చూసి, కిషన్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
ఇంట్లో దొంగతనం జరిగినట్లు బాధితులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు తెలుసుకున్న డీఎస్పీ జైపాల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని, దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం తో వేలిముద్రలను సేకరించారు. త్వరలోనే కేసును ఛేదించి, దొంగలను పట్టుకుంటామని డీఎస్పీ జైపాల్ రెడ్డి తెలిపారు. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం 40 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు దొంగతనానికి గురైనట్టు తెలిసింది.