పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం.. భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలు

by Disha Web Desk 13 |
పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం.. భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలు
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఓ పెళ్లి వేడుకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియలేదు. పెళ్లి మండపం చెక్కలతో చేసి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.


12 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు వెల్లడించారు. కాగా, ప్రమాదంలో కొన్ని వాహనాలు ధ్వంసమైనట్లు చెప్పారు.

Next Story

Most Viewed