- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం
ఇండోనేషియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. అనంతరం వెలువడిన సునామీ హెచ్చరికలు ఆగ్నేయాసియా ప్రాంతాన్ని మరోసారి వణికించాయి. రిక్టర్ స్కేలుపై 6.1 నుండి 6.8 మధ్య తీవ్రతతో నమోదైన ఈ భూకంపం, ఇండోనేషియా తూర్పు భాగంలోని తెర్నేట్ సమీపంలో సముద్ర గర్భంలో కేంద్రీకృతమైంది. ఈ భూకంపం సముద్ర మట్టానికి చాలా తక్కువ లోతులో సంభవించడం వల్ల సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదం ఉందని గుర్తించిన ఇండోనేషియా వాతావరణ మరియు భూభౌతిక సంస్థ (BMKG), తక్షణమే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి పొరుగు దేశాలతోపాటు ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అనేక భవనాలు దెబ్బతిన్నాయని సమాచారం. ప్రాణనష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు మరో 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.






