ఎన్నికల అనంతర హింస పై మాజీ సీఎం మమతా బెనర్జీ సంచలన దీక్ష

by Malleboina Mahesh |   (  Updated:2026-06-02 10:43:52  IST  )

ఎన్నికల అనంతర హింసను నిరసిస్తూ కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ వద్ద ఒకరోజు ధర్నాకు దిగిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.

ఎన్నికల అనంతర హింస పై మాజీ సీఎం మమతా బెనర్జీ సంచలన దీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ పార్టీ (TMC party) ఘోర ఓటమి చెంది బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల అనంతరం వివిధ ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం హింస చెలరేగింది. ఇందులో టీఎంసీ కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా చేసుకొని పులువురు దాడులు చేశారు. ఈ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతాలో ఒకరోజు ధర్నాకు దిగారు. కోల్‌కతాలోని ప్రముఖ సెంట్రల్ ప్రాంతమైన ఎస్ప్లానేడ్ వై-ఛానల్ (Esplanade's Y-channel) వద్ద మమతా బెనర్జీ ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అయితే, ఈ నిరసన ప్రదర్శన నిర్వహణకు సంబంధించి పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురయ్యాయి. దీని పక్కనే ఉన్న రాణి రాష్మణి రోడ్‌ (Rani Rashmani Road)లో ధర్నా చేపట్టేందుకు టీఎంసీ చేసిన అభ్యర్థనను కోల్‌కతా పోలీసులు (Kolkata Police) తిరస్కరించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ అక్కడ కూడిన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమకు నిరసన వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కానీ, మైకులు ఉపయోగించడానికి కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె మెగాఫోన్ ద్వారానే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

Next Story