'మాజీ సీఎంలను ఏ క్షణంలోనైనా హత్య చేస్తాం'.. కర్నాటకలో సంచలనం రేపుతోన్న లేఖలు!

by Disha Web Desk 19 |
మాజీ సీఎంలను ఏ క్షణంలోనైనా హత్య చేస్తాం.. కర్నాటకలో సంచలనం రేపుతోన్న లేఖలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటక రాష్ట్రంలో మాజీ సీఎంల ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోవచ్చంటూ బెదిరింపు లేఖలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయ నాయకులకే కాకుండా.. ప్రముఖ రచయితలకు కూడా ఇలాంటి బెదిరింపు లేఖలు వచ్చాయి. మొత్తం 63 మందిని ఏక్షణంలోనైనా చంపేస్తాం అన్న లేఖలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో కర్నాటక మాజీ సీఎంలు కుమార స్వామి, సిద్దరామయ్యలకు చంపేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇప్పటి వరకు లేఖలు ఎవరు పంపించారు అన్న విషయం మాత్రం తెలియలేదు. ఈ లేఖల్లో వీరందరూ దేశద్రోహులు అంటూ రాసుకొచ్చారు.

వీటిలో సహనం కలిగిన హిందువు అని రాసి ఉండటంతో ఇది పక్కా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారే పనే అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండని రాయడం గమనార్హం. ఈ విషయంపై మాజీ సీఎం కుమార స్వామి స్పందిస్తూ.. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. అంతేకాకుండా బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ లేఖ వల్ల నాకు ఎలాంటి భయం లేదని తెలిపారు. కర్నాటకలో గతంలో కూడా ఇలాంటి బెదిరింపు లేఖలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.


Next Story