లోక్‌సభ వీడియో వైరల్‌పై ఎంపీ శశిథరూర్ ట్వీట్

by Disha Web Desk 13 |
లోక్‌సభ వీడియో వైరల్‌పై ఎంపీ శశిథరూర్ ట్వీట్
X

న్యూఢిల్లీ: లోక్ సభ సమావేశాల్లో వైరల్ గా మారిన వీడియో‌పై ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లా ప్రసంగిస్తున్న ఎంపీ సుప్రియా సూలే, శశి థరూర్ తో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ప్రసంగం జరుగుతున్న సమయంలో ఇదేమి చర్చ అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. అయితే దీనిపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. కొందరు అలాగే అనుకుంటారు.. అది వారి పని అంటూ సాగే హిందీ సాంగ్ లిరిక్స్‌ను షేర్ చేస్తూ.. ఎంపీ సుప్రియా సూలేను ట్యాగ్ చేశారు. తాము ఓ పాలసీ విధానం పై చర్చించినట్లు తెలిపారు. 'ఫరూక్ సాబ్ తర్వాత ఎంపీ సుప్రియా సూలే మాట్లాడాల్సి ఉంది. పాలసీ గురించి ఏదో అనుమానం ఉంటే అడిగి తెలుసుకుంటున్నారు. ఫరూక్ సాబ్‌కు ఇబ్బంది కాకుండా ఆమె మాట్లాడుతున్నారు. తన మాటలు వినడానికి నేను వంగిపోయాను' అని ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు ఈ వీడియో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లతో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed