పవర్​ లేక పనులకు బ్రేక్.. పట్టించుకోని విద్యుత్‌శాఖ​

by Dishafeatures2 |
పవర్​ లేక పనులకు బ్రేక్.. పట్టించుకోని విద్యుత్‌శాఖ​
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోఠి ఆరోగ్యశాఖ క్యాంపస్​లోని డీఎంఈ బిల్డింగ్​లో బుధవారం పవర్​ లేక పనులన్నింటికీ బ్రేక్​ పడింది. స్థానికంగా ఉండే ట్రాన్స్​ఫార్మర్​ కాలిపోవడంతో విద్యుత్​ లేదని స్టాఫ్​ చెప్పారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సదరు ట్రాన్స్​ఫార్మర్​ చెడిపోయినప్పటికీ, విద్యుత్​ శాఖ ఇప్పటి వరకు రిపేర్​ చేయలేదు. దీంతో ఫ్యామిలీ వెల్ఫేర్​, డీఎంఈ, టీవీవీపీ హెచ్​ఓడీ ఎవ్వరూ కార్యాలయాలకు రాలేదని సమాచారం. దీంతో పాటు కొందరు స్టాఫ్​ కూడా వచ్చి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ సబ్​స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్నా ఇప్పటి వరకు మరమ్మత్తులు చేయలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భవనంలో కరెంట్ లేకవోపడంతో వివిధ పనుల నిమిత్తం డీఎంఈ కార్యాలయానికి వచ్చే మెడికల్​స్టాఫ్​ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాల నుంచి కూడా చాలా మంది డాక్టర్లు వచ్చి తిప్పలు ఎదుర్కొన్నారు.



Next Story

Most Viewed