టీఆర్ఎస్ ఎంపీలకు కోమటిరెడ్డి సవాల్.. రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ ఫైర్

by Disha Web Desk 19 |
టీఆర్ఎస్ ఎంపీలకు కోమటిరెడ్డి సవాల్.. రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్​ఎంపీలు రాజీనామా చేస్తే తాము సిద్ధమని కాంగ్రెస్​ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్​ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రైతులపై సీఎం కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే రూ.20 వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనాలని డిమాండ్​చేశారు. రాష్ట్రం ఆదాయం పెరిగిందని చెప్పే సీఎం ధాన్యం కొనుగోళ్లకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్​రాజకీయాలకు స్వస్తి పలుకాలన్నారు. నేలతల్లిని నమ్ముకున్న రైతులను వేధించడం సరికాదని, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైతులు గందరగోళంలో ఉన్నారన్నారు. మరోవైపు రాష్ట్రంలో రోజుకు 10గంటలు కూడా విద్యుత్​ సరఫరా చేయడం లేదని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. పంట కోతకు వస్తున్న నేపథ్యంలో కరెంట్​కోతలు విధిస్తున్నారని, పట్టణ ప్రాంతాలకు 24 గంటలు సరఫరా చేసి, వ్యవసాయానికి కోత పెడుతున్నారన్నారు.

రాహుల్‌ను కలిసిన ఎంపీలు..

కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి కలిశారు. పార్లమెంట్​సమావేశాలకు హాజరై బయటకు వస్తున్న సమయంలో రాహుల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీలతో రాహుల్​గాంధీ కొంతసేపు మాట్లాడారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలకు రాహుల్, సోనియా అపాయింట్​మెంట్​ దొరకడం లేదని వస్తున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా రాహుల్‌కు వివరించారు. దీనిపై స్పందించిన రాహుల్​గాంధీ.. పార్టీ నేతలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర పరిస్థితులపై తాను పరిశీలన చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.



Next Story