ఎవరికి ఆపదొచ్చినా ఆదుకుంటా: కిషన్ నాయక్

by Disha Web Desk 2 |
ఎవరికి ఆపదొచ్చినా ఆదుకుంటా: కిషన్ నాయక్
X

దిశ, దేవరకొండ: నల్లగొండ జిల్లా డిండి మండలం ప్రతాప్‌గర్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈదమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి అఖిలభారత జాతీయ ఆదివాసి కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ రూ.50 వేల విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని దేవాలయ కమిటీ సభ్యులు మాగాని భాస్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా,చదువుకోలేని పేద విద్యార్థులకు చదువుల విషయంలో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి మల్లేష్, మాగాని నాగార్జున, వేములఇద్ది రాములు, వరికుప్పల వెంకటయ్య, దండుగల రంగయ్య, మాగాని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed