పొంచి ఉన్న మరో ముప్పు.. ప్రజలకు కేసీఆర్ హెచ్చరిక

by Sathputhe Rajesh |   (  Updated:2022-07-23 12:45:08  IST  )

దిశ, వెబ్‌డెస్క్: వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. మొన్నటికంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదముందని, మరో

పొంచి ఉన్న మరో ముప్పు.. ప్రజలకు కేసీఆర్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. మొన్నటికంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదముందని, మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. నదులు, ఉపనదులు పొంగుతున్నాయని, ఎల్లుండి నుంచి గోదావరి ఉధృతంగా ఉంటుందని చెప్పారు. గోదావరి ప్రమాద హెచ్చరిక దాటే అవకాశముందని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని అన్నారు. పని కేంద్రాలను ఉద్యోగులు వదిలి వెళ్లవద్దని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల్లోనే ప్రజాప్రతినిధులు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా వరదలపై ఇవాళ సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను అలర్ట్ చేశారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. కేటీఆర్ కాలికి గాయం.. ఆందోళనలో టీఆర్‌ఎస్ వర్గాలు

Next Story