- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీలిమిటేషన్పై కవిత వార్నింగ్! తెలంగాణ వాటా తగ్గితే భారీ ఉద్యమం
డీలిమిటేషన్పై కవిత ఘాటు వ్యాఖ్యలు! తెలంగాణ 3.13% వాటా తగ్గితే ఉద్యమం తప్పదు. మహిళా బిల్లును ఓబీసీ కోటాతో ముడిపెట్టాలని డిమాండ్.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులను తీసుకొస్తుంది. ఈ బిల్లులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha) కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదని, తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని ఆమె హెచ్చరించారు.
ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13 శాతంగా ఉందని, ఇది అత్యంత కనిష్ట స్థాయి అని కవిత పేర్కొన్నారు. "పునర్విభజన తర్వాత కూడా పార్లమెంట్లో తెలంగాణకు కనీసం 3.13 శాతం ప్రాతినిధ్యం ఉండాలి. దీనిని మా రాష్ట్రానికి బేస్లైన్ (కనిష్ట స్థాయి) గా పరిగణించాలి. అంతకంటే ఒక్క శాతం తగ్గినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లే" అని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెరుగుదల పైకి సానుకూలంగా కనిపిస్తున్నా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు వచ్చే సీట్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మహిళా బిల్లును డీలిమిటేషన్తో కాకుండా, ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టాలి. 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు తగిన వాటా (కోటాలో కోటా) కల్పిస్తేనే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది" అని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ, అభివృద్ధిలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై పార్లమెంట్ నుంచి వీధుల వరకు పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు.






