సాహితీ ప్రియులను రంజింపజేసిన కవి సమ్మేళనం

by Javid Pasha |
సాహితీ ప్రియులను రంజింపజేసిన కవి సమ్మేళనం
X

దిశ, మహబూబ్ నగర్ కల్చరల్ : సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన శుభకృత్ నామ ఉగాది కవి సమ్మేళనం సాహితీ ప్రియులను రంజింపజేసింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో జరిగిన కవి సమ్మేళనంలో జిల్లా నలుమూలల నుండి కవులు వచ్చి కవితా గానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా గాయకుడు జయరాజు మాట్లాడుతూ.. కవుల కవిత్వంతోనే ఈ నేల తల్లి పునీతమవుతుందని, కవిత్వంతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవుల పాత్ర కీలకమైందన్నారు. కవిత్వంతోనే ఉద్యమం ఉదృతమైదన్నారు.

ప్రకృతి సిద్దమైన కవితలను రాయాలన్నారు. ప్రకృతి గురించి తన కవితలతో అందరిని రంజింపజేశారు. తెలంగాణ సాహితీ గౌరవాధ్యక్షుడు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు సురభి జగపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్, జిల్లా అధ్యక్షుడు ఖాజా మైనోద్దీన్, నందిగామ కిషోర్, సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, బాలయ్య, విజయ్ కుమార్, రాజసింహుడు తదితర సాహితీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు. అనంతరం కవులందరినీ ఘనంగా సన్మానించి సత్కరించారు.



Next Story

Most Viewed