- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే ఇరాన్ ఇక ఉండదు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
మరోసారి ఉల్లంఘిస్తే ఇరాన్ అనే దేశమే ఉండదు.. ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత భీకర హెచ్చరిక!

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ భూభాగంలోని సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ ప్రభుత్వానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఆయన ఇరాన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Cease Fire Agreement) ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని, వారి అరాచకాలకు ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయని ట్రంప్ స్పష్టం చేశారు.
"కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ మరోసారి (AGAIN!) ఉల్లంఘించినందుకు గాను.. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలతో పాటు తీరప్రాంత రాడార్ స్థావరాలపై ఇప్పుడే దాడులు జరిపాయి. బుద్ధి తెచ్చుకోవడం తమ వల్ల కాదని ఇరాన్ నిరూపిస్తోంది. ఒకానొక దశలో మేము సంయమనం (Reasonable) కోల్పోవాల్సి వస్తుంది. మేము గతంలో అత్యంత విజయవంతంగా ప్రారంభించిన మిలిటరీ ఆపరేషన్ను పూర్తిగా ముగించాల్సి వస్తుంది. ఒకవేళ అదే గనుక జరిగితే.. ప్రపంచ పటంలో 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్' అనే దేశమే ఇకపై ఉనికిలో ఉండదు!" అని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
అలాగు అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడటం, అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, ఇరాన్ గనుక తన దూకుడు తగ్గించకపోతే ఆ దేశాన్ని సైనికంగా పూర్తిగా నిర్మూలిస్తామనే తరహాలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ప్రకటనతో పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం (Full-scale War) సంభవించేలా ఉద్రిక్తతలు పీక్ స్టేజీకి చేరేలా ఉన్నాయని విశ్లేశకులు అంచనా వేస్తున్నారు.






