క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

by Disha Web Desk 13 |
క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్‌లో గల ఎమ్మెస్సార్ బార్‌పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బార్‌లో ఓపెన్ స్క్రీన్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా బెట్టింగ్ పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు ఆదేశాలతో ఆదివారం రాత్రి ఎమ్మెస్సార్ బార్‌పై దాడి నిర్వహించారు. లైవ్‌లో బెట్టింగ్ కాస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లు, ఆరు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రెండవ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సి ఐ వెంకటేశం తెలిపారు.



Next Story

Most Viewed