విరాట్ కోహ్లీ జట్టుకు షాక్.. స్టార్ బౌలర్ ఇంట్లో విషాదం

by Disha Web Desk 13 |
విరాట్ కోహ్లీ జట్టుకు షాక్.. స్టార్ బౌలర్ ఇంట్లో విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యాట్రిక్ విజయాలతో జోష్ మీద ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. జట్టు విజయాల్లో బౌలర్ల పాత్ర కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఆర్సీబీ జట్టులో బౌలర్లందరూ సమష్టిగా, నిలకడగా రాణిస్తోన్నారు. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తప్పితే.. మిగిలిన మూడింట్లోనూ బౌలర్లు రాణించారు. జట్టుకు వరుస విజయాలను అందించారు. బౌలర్లు రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని విజయాలను అందుకుంటోంది. అలాంటి జట్టుకు దిగ్భ్రాంతికర వార్త అందింది. ఆర్సీబీ ఫాస్ట బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను లీడ్ చేస్తోన్న హర్షల్ పటేల్.. ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అతని చెల్లెలు అర్చిత పటేల్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. కన్నుమూశారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఈ సమాచారం అందింది.

దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే హర్షల్ పటేల్- ఇంటికి బయలుదేరి వెళ్లాడు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే తదుపరి మ్యాచ్‌లో హర్షల్ పటేల్‌ ఆడతాడని ఆర్‌సీబీ జట్టు స్పష్టం చేస్తోంది. ఏప్రిల్ 12 చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచుకు ముందే అతను బయోబబుల్‌లో తిరిగి చేరతాడని ఆర్‌సీబీ యాజమాన్యం అంటోంది. రెండు రోజుల్లోనే మ్యాచ్ ఉన్నందున.. హర్షల్ పటేల్ అందుబాటులో ఉంటాడా..? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు.



Next Story

Most Viewed