ఐపీఎల్‌లో నేడు కొత్త జట్ల మధ్య యుద్ధం.. రాహుల్ vs పాండ్యా

by Disha Web Desk 2 |
ఐపీఎల్‌లో నేడు కొత్త జట్ల మధ్య యుద్ధం.. రాహుల్ vs పాండ్యా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌-2022 సీజన్‌ ద్వారా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఇవాళ (మార్చి 28) వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. మంచి మిత్రులైన హార్ధిక్‌ పాండ్యా (గుజరాత్‌), కేఎల్‌ రాహుల్‌ (లక్నో) కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న ఈ రెండు జట్ల మధ్య పోరు రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ అరంగేట్రం మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. కేఎల్‌ రాహుల్‌కు గతంలో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవముండగా, హార్ధిక్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది.


Next Story

Most Viewed