దేశీయ బ్రాండ్ itel నుంచి రూ. 6,499 ధరలో స్మార్ట్‌ఫోన్

by Disha Web Desk 17 |
దేశీయ బ్రాండ్ itel నుంచి రూ. 6,499 ధరలో స్మార్ట్‌ఫోన్
X

దిశ,వెబ్‌డెస్క్: భారతదేశపు బ్రాండ్ itel కొత్తగా A49 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దాని A సిరీస్ పరంపరను కొనసాగిస్తూ itel A49 మోడల్‌ను తెచ్చింది. ఇది 6.6″ HD+ IPS వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే, భారీ 4000 mAh Li-పాలిమర్ ఇన్‌బిల్ట్ బ్యాటరీతో వస్తుంది.

itel A49 స్పెసిఫికేషన్లు..

-6.6-అంగుళాల స్మార్ట్‌ఫోన్, IPS ప్యానెల్ HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్‌‌ను కలిగి ఉంది.

- 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌ను అందిస్తోంది.

- 4,000mAh బ్యాటరీతో 10W చార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంది.

- Itel A49 2GB RAM 32GB స్టోరేజీని కలిగి ఉంది. దీనిని mico SD కార్డ్ స్లాట్ ద్వారా 128GB వరకు విస్తరించవచ్చు.

- స్మార్ట్‌ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ 5MP AI వెనుక కెమెరా, స్పష్టమైన సెల్ఫీల కోసం AI బ్యూటీ మోడ్‌తో కూడిన 5MP సెల్ఫీ కెమెరా ఉంది.

-ప్రారంభ ధర రూ. 6,499.

-ఇది క్రిస్టల్ పర్పుల్, డోమ్ బ్లూ, స్కై సియాన్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.



Next Story

Most Viewed