వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌కు ముందు.. ఇండియాక్ షాక్

by Web Desk |
వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌కు ముందు.. ఇండియాక్ షాక్
X

అహ్మదాబాద్ : వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్సర్ పటేల్ దూరం కానున్నారు. వీరి స్థానంలో బ్యాటర్ దీపక్ హుడా, రుతురాజ్ గైక్వాడ్‌లను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈనెల 16 నుంచి కోల్‌కతా వేదికగా మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి. కేఎల్ రాహుల్ తొడ కండరం గాయంతో బాధపడుతుండగా, అక్షర్ పటేల్ కొవిడ్ -19 నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అక్సర్ మరోసారి కొవిడ్ నిర్దారణ టెస్టులు చేయించుకోవాల్సి ఉంది. ఇక ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన 2వ వన్డేలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్‌కు విశ్రాంతి అవసరమని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. వన్డేల్లో టీమ్ ఇండియా కోసం రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేసిన దీపక్ హుడాను టీ20 సిరీస్ కు ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.


Next Story