దాదాపుగా 18వేల పౌరులు స్వదేశానికి

by Disha Web Desk 17 |
దాదాపుగా 18వేల పౌరులు స్వదేశానికి
X

కీవ్: ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి పౌరులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా మిషన్ ద్వారా ఇప్పటికీ దాదాపు 18వేల పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఒక్క మంగళవారం రోజే సుసెవా నుంచి 410 మంది పౌరులను తరలించినట్లు కేంద్ర పౌరవిమానయాన సరఫరా శాఖ వెల్లడించింది. భారత వాయు దళం 12 విమానాల్లో 2467 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు తెలిపింది. బుకారెస్ట్ నుంచి 21, సుసెవా నుంచి 9, బుడాపెస్ట్ నుంచి 28, కోసైస్ నుంచి 5, రెస్జో నుంచి 11, కీయెవ్ నుంచి ఒక విమానంలో పౌరులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు వివరించారు.



Next Story

Most Viewed