మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

by Disha Web |
మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బుధవారం లీటరుకు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెరిగాయి. గత తొమ్మిది రోజులుగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 5.60 వరకు ధరలు పెరిగాయి. రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.01లకు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ 92.27లకు లభిస్తోంది.

ముంబైలో, లీటరు పెట్రోల్ రూ. 115.88 ఉండగా , డీజిల్ రూ. 100.10 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.106.69కు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.76లకు లభిస్తోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114. 51 కాగా, ఇదే సమయంలో లీటర్ డీజిల్ రూ.100.70 ఉంది . విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.25 ఉండగా, లీటర్ డీజిల్ రూ.102.07 ఉంది.

Next Story

Most Viewed