రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి: ఎమ్మెల్యే చిరుమర్తి.

by Disha Web Desk 12 |
రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి: ఎమ్మెల్యే చిరుమర్తి.
X

దిశ, నకిరేకల్: రాజకీయాలకు తావులేకుండా నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రభాగాన నిలబెడతానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. సబ్బండ వర్గాల నాయకుడు సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిస్తున్నారని స్పష్టం చేశారు. కట్టంగూరు మండలంలోని రామచంద్రపురం, మల్లారం, అంబటివాగు గ్రామాల్లో 50 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 126 మంది లబ్ధిదారులకు ఒక కోటి 30 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 10 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సే ముఖ్యం గా ముందుకు వెళ్తున్నానని ఇందులో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరం అండగా ఉండాలి అన్నారు. అనంతరం మెప్మా ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీటీసీ తరాల బలరాం యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed