ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి!

by Disha Web Desk 13 |
ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి!
X

దిశ, జన్నారం: మండలంలోని ఇందన్ పల్లి గ్రామ సమీపంలో అదుపుతప్పి కారు చెట్టును ఢీకొనడంతో మురిమడుగు మాజీ ఎంపీటీసీ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తన కారులో పెట్రోల్ లేకపోవడం తో పక్క ఇంటి వారి కారును తీసుకుని పెండ్లి రోజు దైవ దర్శనం చేసుకుందామని బుధవారం ఉదయం ఇందన్ పల్లి లో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఇందన్ పల్లి వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో మురిమడుగు గ్రామానికి చెందిన దంపతులు మాజీ ఎంపీటీసీ ఊత్కరి శోభన దేవి (64), మాజీ సర్పంచ్ ఊత్కరి మురళీధర్ రెడ్డి (84) అక్కడిక్కడే మృతి చెందారు.


బతికి ఉన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండని జంట మరణంలో కూడా కలిసే వెళ్ళారని గ్రామంలోని ప్రజలు చర్చించుకున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయి కారులో భార్య భర్తలు ఇద్దరు ఇరుక్కుపోయారు. మృత దేహలను తీయడానికి వీలు లేకపోవడంతో జేసిబి స్థానికుల సహాయంతో ఎస్సై సతీష్ బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని లక్షేటిపేట సి ఐ కరీముల్లా ఖాన్ సందర్శించారు. మురళీధర్ రావు 1990 లో సర్పంచ్ గా గెలిచి సర్పంచ్ గా అనేక సేవలందించారు. అదే విధంగా 2013లో రిజర్వేషన్ పరంగా మురిమడుగు ఎంపీటీసీ గా జనరల్ మహిళ రావడంతో తన భార్య శోభ దేవి ని గెలిపించారు.





Next Story

Most Viewed