బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్.. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ

by Dishanational2 |
బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్.. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట లభించలేదు. ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వేసిన సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలను మొదటి రోజే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించి సస్పెన్షన్ కొట్టివేసి, సమావేశాలకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. వారి సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు.. ప్రొసిడింగ్స్ ఉత్తర్వులు, వీడియో రికార్డులు సమర్పించేలా ఆదేశాలివ్వడానికి కూడా కోర్టు అంగీకరించలేదు. కానీ, మరోసారి పూర్తిస్థాయి విచారణ జరపాలని అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


Next Story

Most Viewed