కారు డ్రైవర్ కు రూ.4.70 కోట్ల GST నోటీసులు

by Muthe.Rajitha |

తమిళనాడులోని వేలూరుకు చెందిన కమల్‌నాథన్ అనే ఒక సామాన్య కారు డ్రైవర్ కు అనుకోని షాక్ తగిలింది.

కారు డ్రైవర్ కు రూ.4.70 కోట్ల GST నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని వేలూరుకు చెందిన కమల్‌నాథన్ అనే ఒక సామాన్య కారు డ్రైవర్ కు అనుకోని షాక్ తగిలింది. తాను ఎప్పుడూ చూడని, కనీసం వినని వ్యాపారానికి సంబంధించి ఏకంగా రూ. 4.70 కోట్ల జీఎస్టీ (GST) చెల్లించాలంటూ నోటీసు రావడంతో షాక్ అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి కమల్‌నాథన్ యొక్క ఆధార్, పాన్ (PAN) కార్డు వివరాలను దొంగిలించి, ఆయనకు తెలియకుండానే ఆయన పేరు మీద జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి, నకిలీ కంపెనీలను (Shell Companies) సృష్టించి, భారీ స్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను ఎగవేసి, చివరకు ఆ కంపెనీలను మూసివేసి సదరు మోసగాడు పరారయ్యాడు.

రిజిస్ట్రేషన్ పత్రాల్లో కమల్‌నాథన్ పేరు మరియు చిరునామా ఉండటంతో, జీఎస్టీ అధికారులు సహజంగానే ఆయనకే రూ. 4.70 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. కనీసం తిండికి కూడా కష్టపడే ఒక డ్రైవర్‌కు ఇన్ని కోట్ల నోటీసు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తాను నిర్దోషినని, తన డాక్యుమెంట్లను ఎవరో దుర్వినియోగం చేశారని మొరపెట్టుకుంటూ కమల్‌నాథన్ వెంటనే జీఎస్టీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఉదంతం అనంతరం మన ఆధార్, పాన్ కార్డుల ఫోటో కాపీలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వకూడదని, ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో వివరాలు అడిగేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story