నర్సారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

by Disha Web |
నర్సారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలోని పాత రాజంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నర్సారెడ్డి(65) తేనెటీగలు దాడి చేయడంతో ఈ నెల 2వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు శనివారం మృతుడి కుటుంబ సభ్యులైన కొండల్ రెడ్డి, రాజీరెడ్డిలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సారెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు పిప్పిరి ఆంజనేయులు, కౌన్సిలర్ రూప, లక్కాకుల రాజ్ కుమార్, వెంకట్, నరేష్, భాస్కర్, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed