- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యాదాద్రిలో వైభవంగా మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలు
by Disha Web Desk 13 |
X
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రిలోని శ్రీ స్వామి వారి బాలాలయంలో నిత్యారాధనల అనంతరం.. శ్రీ స్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవం లో భాగంగా సోమవారం సాయంత్రం మృత్సంగ్రహణం వేడుకలు, అంకురారోపణం, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన వేడుకలను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, ఆర్యక బృందం, పారాయణికులు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేకత..
పాలికలను (మట్టిపాత్రలను) విష్ణు గాయత్రీ మంత్రముచే శుద్ధి చేసి, వాటిలో మృత్తికను, ధాన్యములను పోసి నీటితో గడుపుతారు. తర్వాత సర్వాలంకృతములు గావింపబడి ఆ పాలికలను దేవతా స్వరూపములుగా అర్చించి ఆరాధించుట ఉత్సవములతో ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. విత్తనములు మంత్రోదకములచే పూజింపబడి మొలకెత్తింపబడుట లోక కల్యాణ కారకమని శాస్త్రోక్తం.
Next Story