- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుదల… వినియోగదారులపై భారంగా మారుతున్న ఎల్పీజీ
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగి సాధారణ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగి సాధారణ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఇటీవల జరిగిన ధరల సవరణలతో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.900 నుంచి రూ.970 మధ్య కొనసాగుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కిలోలు) ధరలు అయితే మరింతగా పెరిగి రూ.2000 నుంచి రూ.2300 వరకు చేరాయి. ఈ పెరుగుదలతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా మార్చి నెలలో గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడం, అలాగే ఏప్రిల్ నెలలో కూడా అదే ట్రెండ్ కొనసాగుతుండడం గమనార్హం. ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి, పేద ప్రజలు తమ రోజువారీ ఖర్చులతో కష్టాలు పడుతున్నారు. వినియోగదారులు ప్రభుత్వం నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. గ్యాస్ ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






