దారుణం : ఫ్రెండిషిప్ మరిచిన మిత్రులు.. స్నేహితున్ని 30 ముక్కలుగా నరికేశారు

by Dishanational2 |
దారుణం : ఫ్రెండిషిప్ మరిచిన మిత్రులు..  స్నేహితున్ని 30 ముక్కలుగా నరికేశారు
X

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో దారుణం చోటు చేసుకుంది. స్నేహన్ని మరిచిన కొందరు వ్యక్తులు తమ మిత్రున్ని దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని 30 ముక్కలుగా చేసి భూమిలో పాతి పెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీలోని హపూర్‌లో కలకలం సృష్టిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఇర్ఫాన్ (34) అతని స్నేహితుడు రఘీబ్ ఇర్ఫాన్ ఇద్దరూ స్నేహితులు. ఇర్ఫాన్ ఫాస్టాగ్ దుకాణం నడుపుతూ, రెస్టారెంట్ చూసుకుంటాడు. అయితే ఇర్ఫాన్ వ్యాపారంలో రఘీబ్ పెట్టుబడి పెట్టి భాగస్వామిగా చేరాడు. ఇద్దరూ లేకపోవడంతో షాపు నిర్వహణకు మొహమ్మద్ అకిబ్‌ను నియమించుకున్నారు. తరువాత, ఇర్ఫాన్ ప్రారంభించిన వ్యాపారంలో రఘిబ్ పెద్ద వాటా కోరడంతో ఇద్దరు భాగస్వాముల మధ్య కొంత వివాదం తలెత్తింది. ఫాస్టాగ్‌ షాప్‌ ఇవ్వాలని, లేదంటే తాను పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని రఘీబ్‌ ఇర్ఫాన్‌కు చెప్పాడు. ఇర్ఫాన్ నిరాకరించడంతో, రఘీబ్ అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మహ్మద్ రఘీబ్, అతని స్నేహితుడు మహ్మద్ అకిబ్‌, మరో స్నేహితుడు కలిసి ఇర్ఫాన్‌ను దారుణంగా హత్యచేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వ్యాపార భాగస్వామి మహ్మద్ రఘీబ్, స్నేహితుడు మహ్మద్ అకిబ్‌ను అరెస్టు చేశారు. మరో స్నేహితుడు మాజిద్ అలీ పరారీలో ఉన్నాడు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



Next Story