వారి గుడిసెలపై ఫారెస్ట్ అధికారులు దాడి..

by Disha Web Desk 13 |
వారి గుడిసెలపై ఫారెస్ట్ అధికారులు దాడి..
X

దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని నీలంపల్లి గ్రామస్తులు కిష్టాపురంలో నిర్మించుకున్న గుడిసెలను కొద్దిరోజుల కిందట ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ తో కూల్చివేశారు. సోమవారం డీపీవో ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, అటవీశాఖ హద్దులు తీయగా అది అటవీ శాఖ భూమి అని తేల్చి చెప్పారు.


ఈ మేరకు మంగళవారం అడవిని ధ్వంసం చేయడం నేరమని, వెంటనే గుడిసెలను తీసివేయాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆ గ్రామస్తులు గుడిసెలు తీయకపోవడంతో.. అటవీ శాఖ అధికారులు బలవంతంగా ట్రాక్టర్లతో గుడిసెలు, గుడారాలు తొలగించారు.



Next Story

Most Viewed