బ్రేకింగ్: కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
X

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి, సిరిసిల్ల రహదారిపై మాచారెడ్డి మండలం గన్‌పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అందులో ఒక బాలుడు మృతి చెందడంతో ఘటనా స్థలం హృదయవిదారకంగా మారింది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి వైపు వస్తుండగా.. షిఫ్ట్ కార్‌లో కామారెడ్డి వైపు నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కారులోనే విగతజీవులుగా మారగా బాలుడు మాత్రం డోర్ ఓపెన్ బయట పడి చనిపోయాడు. మృతుల వివరాల కోసం స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.


Next Story

Most Viewed