మనవరాలి అన్నప్రాసన కు వెళుతూ రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు..

by Mahesh |
మనవరాలి అన్నప్రాసన కు వెళుతూ రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు..
X

దిశ, మియాపూర్: మనవరాలి అన్నప్రాసన కి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఓకె కుటుంబంలో 5 గురు మృత్యువాత పడిన హృదయ విదారక సంఘటన చందానగర్ హుడా కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చందానగర్ హుడా కాలనీలో ఇంటి నెం, సీ -15 లో ఉంటున్న కుటుంబరావు కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం. తన మనవరాలు చిన్న కుమార్తె శాంతి కూతురు ప్రిన్సెస్ (6నెలలు)కు అన్నప్రాశన చేయించేందుకు కారులో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో జంగారెడ్డి గూడెం (అల్లుని సొంతూరు) బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటలకు కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చేరుకోగానే అతివేగంతో పయనిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను డీ కొట్టి పల్టిలు కొట్టంది. దీంతో 6 నెలల చిన్నారి తో సహా అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘటనలో కుటుంబరావు ( 65) భార్య మేరీ (53) కూతురు ఇందిర (30), కోడలు శాంతి( 32)ప్రిన్సెస్ (6) నెలలు ప్రాణాలు పోగా.. జోషి (36) ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అతణ్ని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. రాత్రి మాతో మాట్లాడిన కుటుంబం తెల్లవారే సరికి లేరనే విషయం జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో హుడా కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed